దేశంలో మైనర్ బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్థాక్రే ఆవేదన వ్యక్తంచేశారు. మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారి కాళ్లు, చేతులు నరకాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కఠినతరమైన షరియా (ఇస్లామిక్) చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే ప్రస్తుత చట్టాలను మార్చాల్సిన అవసరముందన్నారు. సంఘవ్యతిరేకశక్తులను అదుపు చేసేందుకు షరియావంటి కఠిన చట్టాలు అమలు చేయాలని రాజ్థాక్రే డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.