జయలలితకు మేనకా గాంధీ లేఖ వ్యక్తిగతం : బీజేపీ నేత

సోమవారం, 20 అక్టోబరు 2014 (15:16 IST)
అక్రమాస్తుల కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు కేంద్ర మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీ లేఖ రాయడం ఆమె వ్యక్తిగతమని బీజేపీ జాతీయ నేత మురళీధర రావు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. జయలలితకు మేనకా లేఖలు అంశం వారివారి వ్యక్తిగతం. ఇందులో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు 
 
మహారాష్ట్రలో మద్దతుపై ఎటువంటి బెదిరింపు ధోరణి లేదన్నారు. శివసేనతో తమ మైత్రి కొనసాగుతుందనే అనుకుంటున్నామన్నారు. మేనకా గాంధీతో పాటు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌లు జయలలితకు వేర్వేరుగా లేఖలు రాసిన విషయం తెల్సిందే. రజనీకాంత్ వంటి స్టార్లను నియంత్రించ లేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి