లింగా సినిమా కోసం జయకు రజనీకాంత్ లేఖ: బీజేపీకి షాక్!

సోమవారం, 20 అక్టోబరు 2014 (19:24 IST)
లింగా సినిమా కోసమే తమిళనాడు మాజీ సీఎం జయలలితకు రజనీకాంత్ లేఖ రాశారని ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీకి షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు పలుకుతూ.. లేఖ రాశారు. బీజేపీ రజనీకాంత్‌కు గాలం వేస్తున్న తరుణంలో రజినీ కాంత్ అమ్మకు లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
 
బెయిల్‌పై విడుదలై చెన్నై పోయస్‌గార్డెన్‌లోని తన నివాస గృహానికి చేరుకున్న సందర్భంగా రజినీ కాంత్ హర్షం వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాసినట్లు అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో మీ రాక (అమ్మ) తమిళ ప్రజలకు అమితానందాన్ని ఇచ్చింది. మళ్లీ  మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రశాంతత, ఆరోగ్యం చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
అయితే బీజేపీ రజినీ కాంత్‌కు గాలం వేయడంతో పాటు ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించడానికి రెడీ అయిన పరిస్థితిలో రజని అమ్మ క్షేమం కోరుతూ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. 
 
కానీ రజనీ తాజా చిత్రం లింగా డిసెంబర్ 12న విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్ర విడుదలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తతోనే రజనీకాంత్ అమ్మరాకకు హర్షం వ్యక్తం చేస్తూ లేఖ రాశారనే ప్రచారం జోరందుకుంది.

వెబ్దునియా పై చదవండి