అయోధ్యలో రామ మందిరం నిర్మాణం.. విరాళాలు సేకరించనున్న రాష్ట్రపతి

శుక్రవారం, 15 జనవరి 2021 (11:27 IST)
రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధుల బృందంలోని సభ్యులైన కోశాధికారి గోస్వామి కోవింద్‌ దేవ్‌గిరి మహరాజ్‌, వీహెచ్‌పీ కార్యనిర్వహక అధ్యక్షుడు అలోక్‌కుమార్‌, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ మిశ్రా, ఢిల్లీ ఆర్‌ఎస్‌ఎస్ కాన్సుల్ జనరల్ కుల్‌భూషన్‌ అహుజా రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసి మొదటి విరాళం స్వీకరించనున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రపతి నుంచి విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి. 
 
అలాగే ప్రధాని ప్రతినిధుల బృందం నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతిని కలిసి విరాళాల సేకరించనున్నారు. నిధుల సేకరణ శుక్రవారం ప్రారంభమై.. వచ్చే నెల 27వ తేదీ వరకు సాగనుంది. నిధుల సేకరణ కోసం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రముఖ వ్యక్తులతో కమిటీలను ఏర్పాటు చేశారు.
 
అదే సమయంలో పట్టణాలు, గ్రామాల్లోనూ కమిటీలను నియమించారు. నిధుల సేకరణలో భాగంగా దేశవ్యాప్తంగా 13 కోట్ల కుటుంబాలకు చెందిన 65 కోట్ల మందిని రామభక్తులు కలువనున్నారు. వీహెచ్‌పీ నేతృత్వంలో జరిగే ప్రచారంలో 40లక్షల మంది పాలు పంచుకోనున్నారు. 
 
నిధుల సేకరణ, ప్రచారం కోసం దేశవ్యాప్తంగా 5.25 లక్షల గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్లు అలోక్ కుమార్ తెలిపారు. అన్ని బృందాల్లో ఐదు నుంచి ఏడుగురు వ్యక్తులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ప్రతి ఐదు పంచాయతీలపై ఓ ఫండ్‌ డిపాజిటర్‌ ఉండనున్నారు. వారంతా సేకరించిన మొత్తాన్ని ఏ రోజుకారోజు బ్యాంకులో జమ చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు