భారత్ - అమెరికా మధ్య 'దోస్తీ' మరింత పెరగాలని, తనకు మోడీ కుర్తా వేసుకోవాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ఒబామా చాలా ఉల్లాసంగా కనిపించారు.
తాను కనీసం ఐదు గంటలు పడుకోవాలని చెప్పారు. నేను ఐదు గంటలు నిద్రపోతున్నందుకు ఆనందం కలిగిందని చెప్పారు. అలాగే, మొసలి దాడి నుంచి ఒకసారి తప్పించుకున్న విషయం కూడా తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. ఆయన చాలా గట్టి మనిషని, మంచి స్టైల్ కూడా ఉందని అన్నారు.