గురువాయూర్‌లో ముఖేష్ అంబానీ..

శనివారం, 17 సెప్టెంబరు 2022 (19:57 IST)
mukesh Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆయన శనివారం కేరళలోని గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయాన్ని సందర్శించారు. 
 
ఈ ఆలయ సందర్శనలో ముకేష్ అంబానీతో పాటు ఆయన కోడలు రాధిక మర్చంట్ వున్నారు. ఈ సందర్భంగా గురువాయూర్ శ్రీకృష్ణుని గర్భగుడికి అంబానీ తన కుటుంబంతో సహా నెయ్యిని ప్రత్యేక పూజల కోసం సమర్పించారు. అనంతరం గురువాయూర్ ఆలయ ఏనుగులు చెంతమరక్షన్‌, బలరామన్‌లకు ఆహారాన్ని సమర్పించారు. 
mukesh Ambani
 
గురువాయూర్ దేవస్థానం బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ పీకే విజయన్ ముఖేష్ అంబానీకి స్వాగతం పలికారు. ముఖేష్ అంబానీకి పీకే విజయన్ పెయింటింగ్‌ను బహూకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు