డబ్బులు తీసుకుని ఎగిరిపోయిన వలస పక్షిని కాదు... కపిల్ సిబల్‌కు రీటా కౌంటర్

శనివారం, 22 అక్టోబరు 2016 (09:52 IST)
కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన కాంగ్రెస సీనియర్ నేత, మాజీ మంత్రి రీటా బహుగుణపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలు రీటా బహుగుణ కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులు తీసుకుని ఎగిరిపోయిన వలస పక్షిని కాదని స్పష్టంచేశారు. 
 
తన వ్యక్తిగత డబ్బు తీసుకుని తిరిగివ్వలేదన్న తరహాలో కాంగ్రెస్ ఎంపీ సిబల్ ప్రచారం చేసి హడావిడి చేశారు. అందులో భాగంగా రీటాను.. ఆ వలస పక్షి తన డబ్బులతో ఎగిరిపోయింది అన్నట్లు సిబల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
 
ఈ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తనపై వ్యాఖ్యలు చేసిన సిబల్ క్షమాపణ కోరాలని ఆమె డిమాండ్ చేశారు. సిబల్ వంటి సీనియర్ నేతలు ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిబల్ నుంచి తన నియోజకవర్గం కోసం ఎంపీలాడ్(ఎంపీ నిధులు) ఫండ్ తీసుకున్నానని, అయితే అది ఎవరి వ్యక్తిగత డబ్బు కాదని ఆమె ఘాటుగా స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి