ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్లో తమకు సంప్రదాయ వంటలు వడ్డించలేదన్న నెపంతో 11 మంది శివసేన ఎంపీలు ఒక ముస్లిం వ్యక్తికి రోటీ తినిపించి రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేసిన అంశం పార్లమెంటులో దుమారం రేపింది. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. శివసేన ఎంపీలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.