సభలో స్పీకర్ చర్యకు నిరసనగా డీఎంకే సభ్యులు సభలోనే కూర్చొన్నారు. దీంతో అసెంబ్లీ విపక్ష నేత ఎంకే స్టాలిన్తో పాటు పలువురు ముఖ్య నేతలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ప్రభుత్వం తనను అవమానించిందని, ఏ మాత్రం మర్యాదలేకుండా ప్రవర్తించిందని స్టాలిన్ ఆరోపించారు.
కాగా, ప్రతినిత్యం సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నందుకుగాను డీఎంకే సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేయాలని శాసనసభా నేత, ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ ఈ చర్య తీసుకున్నారు.