సాధారణ ప్రజలపై పన్ను విధిస్తుండగా రాజకీయ పార్టీలు నూటికి నూరుశాతం పన్ను మినహాయింపును ఎలా పొందుతారని వాదిస్తూ తన వద్దకు వచ్చిన పిటిషన్ను భారత సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ రాజకీయ విధానాలను ప్రచారం చేసుసునేందుకు డబ్బు అవసరం ఉంటుందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు బెంచ్ సంబంధిత పిటిషన్ను కొట్టివేసింది.
వివరాల్లోకి వెళితే.. 1961 ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 13 ఎకి ఉన్న రాజ్యంగ బద్ధతను సవాలు చేస్తూ శర్మ పిటిషన్ దాఖలు చేసారు. సామాన్య ప్రజలపై పన్ను విధిస్తుండగా, రాజకీయ పార్టీలు నూటికి నూరు శాతం ఆదాయ పన్ను మినహాయింపును ఎలా అనుభవిస్తున్నారంటూ పిటిషనర్ సవాలుచేశారు.
ఆర్థిక శాఖ కార్యదర్సి ప్రకటన భారత పౌరులను ఆర్థిక పరంగా మరియు జీవనపరంగా పెద్ద దెబ్బతీస్తుందని, రాజకీయ పార్టీలకు నూరుశాతం పన్ను మినహాయింపును వెంటనే ఆపివేషి ఆ సెక్షన్లనే రద్దుచేయకపోతే మొత్తం సమాజానికి తీవ్ర ప్రమాదం కలుగుతుందని పిటిషన్దారు వాదించారు.