ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ ‘మోడీ వ్యాపార, నిర్వహణ నైపుణ్యాలు మిగిలిన ప్రధానుల కంటే మెరుగైనవి. అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించడంతో పాటు పలు కొత్త ఒప్పందాలకు తెరతీసిన మోడీ, మిగిలిన ప్రధానుల కంటే ముమ్మాటికీ మెరుగైనవారే’ నంటూ ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీతో ఉన్న 15 ఏళ్ల నాటి బంధాన్ని తెంచుకుని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరి పోరు సాగించనున్నశరద్ పవార్ పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకునే దిశగా పయనిస్తోందన్న వార్తల నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.