ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన మాట నిజమేనని, అయితే ఏంటట? అంటూ ఎయిర్ ఇండియా ఉద్యోగులపై శివసేన ఎంపీ చిర్రుబుర్రులాడారు. అంతేకాదు... తనపై మర్డర్ కేసు పెట్టుకోండంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. శివసేన ఎంపీ రవీంద్ర గ్వైకాడ్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.