దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 70వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న సోనియా గాంధీ మాట్లాడుతూ.. మహిళా బిల్లును పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పారు.