జల్లికట్టు ఉద్యమకారులపై పోలీసు చర్య సూపర్బ్... చితక్కొట్టాల్సిందే : సుబ్రమణ్య స్వామి

సోమవారం, 23 జనవరి 2017 (15:37 IST)
జల్లికట్టు క్రీడకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతూ మెరీనా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్న జల్లికట్టు ఉద్యమకారులపై పోలీసుల చర్యల మంచి చర్య అని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఉద్యమకారుల డిమాండ్లన్నీ అంగీకరించినందున నిరసనలు కొనసాగించడంలో అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
పోలీసు చర్యకు నిరసనగా చెన్నైలో పోలీసు స్టేషన్‌కు నిప్పుపెట్టడం, పలు వాహనాలను తగులబెట్టడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా, పోలీసు చర్యను స్వాగతించిన స్వామి, నిరసనకారుల డిమాండ్లన్నీ తీరాయన్నారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో చట్టం చేయబోతున్నప్పుడు నిరసనలు కొనసాగించడం ఎందుకు? అని ప్రశ్నించారు. జల్లికట్టు క్రీడను ఆయన సమర్థించారు. ఈ క్రీడలో ఎప్పుడూ ఒక్క ఎద్దు కూడా చనిపోలేదన్నారు. 
 
జంతులవులపై కూరత్వం అనేదే క్రీడలో లేదని చెప్పారు. 'జల్లికట్టు క్రీడే జంతువులపై కౌర్యంగా భావిస్తే హలాల్ మాంసం కూడా నిషేధించాలి. పెటా పూర్తిగా మన సంప్రదాయాలు తెలియని విదేశీయులతో నిండిన సంస్థ' అని స్వామి విమర్శించారు. వాస్తవానికి జల్లికట్టు క్రీడా పోటీలను సుబ్రమణ్య స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తూ యవతను రెచ్చగొట్టేలా ట్వీట్లు కూడా చేశారు. దీంతో ఆయన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి