ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... మధ్యప్రదేశ్లో ఐదేళ్ల క్రితం ఏడేళ్ల చిన్నారిని రేప్చేసి దారుణంగా హత్యచేసిన కేసులో దోషికి కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. అతనికి 25 ఏళ్లపాటు కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. దోషి తట్టు లోధీ అలియాస్ పంచమ్ లోధీ చేసిన నేరం అత్యంత అరుదైన నేరాల కోవలోకి రాదు కాబట్టి అతనికి కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను ధ్రువీకరించడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
లోధాకు తాము విధించిన శిక్షలో భవిష్యత్తులో తగ్గించరాదని, ఏవిధంగా క్షమాపణ ప్రసాదించరాదని, పాతికేళ్లపాటు శిక్ష అనుభవించాకే అతన్ని విడుదల చేయాలని కూడా సుప్రీంకో ర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ శివకీర్తి సింగ్, జస్టిస్ ఏఎం సప్రేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.