బాలికపై అత్యాచారం చేసిన స్నేహితులు - నిందితుల్లో ముగ్గురు మైనర్లు

ఆదివారం, 26 డిశెంబరు 2021 (18:45 IST)
గుజరాత్ రాష్ట్రంలోని డాంగ్ జిల్లాలో దారుణం జరిగింది. 14 యేళ్ల బాలికపై స్నేహితులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... డాంగ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 14 యేళ్ల బాలిక రెండు నెలల క్రితం పక్క ఊరిలో జరిగిన ఓ వివాహానికి హాజరై ఇంటికి వస్తున్నది. ఆ సమయంలో ఆమెను మైనర్ స్నేహితుడు బలవంతంగా కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత తన స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో వచ్చే దారిలో మరో 8 మంది స్నేహితులు కలిసి ఆ బాలికను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిలో 9 మంది నిందితుల్లో ఆరుగురు 20 యేళ్ళలోపు వారు కాగా, మరో ముగ్గురు మైనర్లు. పైగా, వీరు చేసిన పాడుపని ఓ మైనర్ బాలుడు వీడియో తీశాడు. 
 
ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వ్యక్తులను చూసి బాలికను అక్కడే వదిలివేసి పరారయ్యారు. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను ఆ కామాంధులు బెదిరించారు. అయితే, ఈ అత్యాచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు... కేసు నమోదు చేసి ఈ నెల 24వ తేదీన 9 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిందరిపై పోక్సో చట్ట కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు గుజరాత్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు