బాలికపై అల్లుడు అత్యాచారం చేస్తుంటే వీడియో తీసిన మామ, ఆపై అతడు కూడా...

గురువారం, 25 మార్చి 2021 (11:54 IST)
పదో తరగతి చదివే బాలికకు మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ఈ ఘటన ఘజియాబాదులో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు చూస్తే... సమీర్ అనే యువకుడు ఆటోమొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. అతడి షాపుకి సమీపంలో 15 ఏళ్ల వయసున్న పదోతరగతి బాలిక కుటుంబసభ్యులతో వుంటోంది.
 
నెల రోజుల క్రితం సమీర్ బాలికతో మాటలు కలిపాడు. ఆ మాటలు స్నేహానికి దారితీశాయి. మార్చి 11వ తేదీన ఆమెను తన షాపు వద్దకు రావాలని కోరాడు. ఆమె రాగానే మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. షాపులోనే ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అక్కడే వున్న సమీర్ మామ దీపక్ ఆ అత్యాచార దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియో చూపి అతడు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అనంతరం... విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోలను నెట్లో పెడతామని బెదిరించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వారే ఫోన్ చేసి... ఆ వీడియోలను నీ కళ్లెదుటే డిలిట్ చేస్తాం రమ్మని చెప్పారు. వారి మాటలు నమ్మి బాలిక అక్కడికి వెళ్లగానే మరోసారి ఆమెపై అఘాయిత్యం చేశారు. మరో స్నేహితుడిని పిలిచి అతడితోనూ చేయించారు.
 
ఇంటికి వచ్చిన బాలిక రెండ్రోజుల పాటు అన్నం తినలేదు. తన ఆరోగ్యం బాగాలేదని తల్లికి చెప్పడంతో ఆమె గట్టిగా నిలదీసింది. దాంతో జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై సెక్షన్ 376డి, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు