ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నారు... ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న విద్యార్థులు!

సోమవారం, 25 జులై 2016 (15:12 IST)
ముంబై పోలీసులకు ఓ వింత పరిస్థితి ఏర్పడింది. తమ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నారంటూ ఒక పాఠశాలకు చెందిన విద్యార్థులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థులందరిపై పోలీసులు ఐపీసీ 377 (హోమో సెక్సువల్ నేరం కింద) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దక్షిణ ముంబై పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థి, ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పరస్పరం లైంగిక దాడి ఆరోపణలు చేసుకున్నారు. ఐదో క్లాస్ విద్యార్థి ఒకరు స్కూల్లో టాయ్లెట్కు వెళ్లిన సమయంలో ఇద్దరు ఆరో తరగతి విద్యార్థులు తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారని తన పేరెంట్స్కు చెప్పారు. దీంతో ఆ విద్యార్థులను పిలిచి మందలించారు. 
 
ఆ తర్వాత ఆరో తరగతి విద్యార్థులు సైతం తమ జూనియర్పై ఇవే ఆరోపణలు చేశారు. ఆపై ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు గామ్దేవీ పోలీస్స్టేషన్కు చేరారు. దీంతో పోలీసులు విద్యార్థులపై కేసు నమోదుచేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి