డ్రైనేజీ కాలువలో గర్భసంచితో కూడిన శిశువుల మృతదేహాలు.. స్థానికుల షాక్

మంగళవారం, 8 నవంబరు 2016 (12:57 IST)
డ్రైనేజీ కాలువలో గర్భసంచితో కూడిన శిశువు మృతదేహాలు కనిపించడం తిరుచ్చిలో సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా, మన్‌ప్పారై సమీపంలోని తువరంకురుచ్చిలోని డ్రైనేజీ కాలువలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు శిశువుల మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. ఈ శిశువులు గర్భసంచిలతో కనిపించడంతో స్థానికులు షాక్ తిన్నారు. 
 
వెంటనే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు, పారిశుద్ధ్య అధికారులకు తెలియజేశారు. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన అధికారులు, డ్రైనేజీ కార్మికులు శవాలను కాలువ నుంచి వెలికితీశారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ఆస్పత్రుల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి