ఆప్ ఎమ్మెల్యేలకు వినూత్న శిక్ష విధించిన కోర్టు

మంగళవారం, 4 జులై 2023 (12:08 IST)
ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఇద్దరు శాసనసభ్యులకు కోర్టు వినూత్న శిక్ష విధించింది. కోర్టు పనివేళలు ముగిసే వరకు కోర్టు ప్రాంగణం నుంచి వెళ్ళరాదని ఆదేశించింది. 2015లో దాఖలైన కేసు విచారించిన న్యాయస్థానం ఆప్‌కు చెందిన అఖిలేశ్ త్రిపాఠి, సంజీవ్ ఝా‌లకు ఈ శిక్షపడిన వారిలో ఉన్నారు. 
 
బురారీ పోలీస్ స్టేషన్‌లోని కానిస్టేబుళ్లపై 2015లో జరిగిన దాడి కేసులో ఎమ్మెల్యేలను నిందితులుగా తేల్చిన మెజిస్టీరియల్ కోర్టు జనవరిలో వారికి జైలు శిక్ష విధించింది. త్రిపాఠికి ఆరు నెలలు, సంజీవ్ ఝా‌లకు మూడు నెలల శిక్ష విధించింది. అయితే, ఎమ్మెల్యేల అప్పీల్‌తో ఈ తీర్పును సోమవారం సమీక్షించిన స్పెషల్ జడ్జి జస్టిస్ గీతాంజలి... గతంలో కోర్టు విధించిన జైలుశిక్షను రద్దు చేస్తూ, తాజాగా శిక్ష విధించింది. ఈ జడ్జిలో తమ కుర్చీలో నుంచి లేచేవరకూ కోర్టులోనే ఉండాలని శిక్ష విధించింది. దీంతో పాటు ఎమ్మెల్యేలు ఇద్దరూ చెరో పదివేలు జరిమానా కట్టాలని ఆదేశించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు