దేశ రాజధాని ఢిల్లీ తన పేరు నిలబెట్టుకుంటోంది. ఇప్పటికే క్రైమ్ ఘటనలకు పెట్టించి పేరుగా దేశరాజధాని ఢిల్లీ ముందువరుసలో ఉంది. అలాంటి ఢిల్లీలో మరో దారుణ హత్య వెలుగు చూసింది. ప్యాసింజర్లుగా ట్యాక్సీ ఎక్కిన ఇద్దరు యువకులు డ్రైవర్ను కాల్చిచంపిన ఘటన ఢిల్లీలోని నజఫ్గఢ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే కుల్ దీప్ అనే వ్యక్తి ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్గా జీవనం గడుపుతున్నాడు.