ఉక్రెయిన్ - రష్యా యుద్ధం - రాష్ట్రంలో వంట నూనెల భగ్గు

శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (07:59 IST)
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైంది. గురువారం నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. ఈ దాడులను ఉక్రెయిన్ సమర్థంగా ఎదుర్కొంటూ, రష్యాకు చెందిన ఫైటర్ జెట్లపై ప్రతి దాడులు చేస్తుంది. అయితే, ఈ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే భారత్ సహా అనేక ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. 
 
అమెరికా డాలరు విలువ గణనీయంగా పడిపోయింది. అదేసమయంలో వివిధ రకాలైన వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. నిజానికి ఇప్పటికిపుడు ఎలాంటి కొరత లేకున్నప్పటికీ వ్యాపార వర్గాలు మాత్రం కృత్రిమ కొరతకు తెరరీశాయి. దంతో ఒక్క రోజులోనే వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి. 
 
గురువారం రాష్ట్రంలో పామాయిల్, సన్‌ఫ్లవర్, ఇతర అన్ని రకాల వంట నూనెల ధరలు ఒకేసారి లీటరుకు రూ.10 మేరకు పెంచేశారు. బుధవారం వరకు వినియోగదారులకు పామాయిల్ ధర సగటున రూ.135గా ఉండగా అది గురువారానికి రూ.145కు చేరుకుంది. అలాగే, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.138 నుంచి రూ.150కు చేరుకుంది. హోల్‌సేల్ వ్యాపారాలు కూడా అంతే స్థాయిలో ధరలు పెంచారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరిన్ని రోజులు కొనసాగిన పక్షంలో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు