ఇటీవల ఓ స్కూలు డైరక్టర్ తన పదవిని, వయస్సును మరిచి తన స్కూలులో చదువుకునే విద్యార్థిని (15) పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను లొంగదీసుకుని అసభ్యంగా చిత్రీకరిస్తూ ఓ వీడియోను వాట్సాప్లో అప్ చేశాడు. ఈ వీడియో ద్వారా ఆ డైరక్టర్ అరస్టయ్యాడు.
దాదాపు 20 మంది బాలికలపై ఆ డైరక్టర్ నీచంగా ప్రవర్తించాడని.. ఈ విషయం వాట్సాప్ ద్వారా బాగా ప్రచారం కావడంతోనే 18 ఏళ్లు నిండని బాలికలు ఇక ఫోన్లు వాడకూడదని నిర్ణయించినట్లు పంచాయతీ పెద్దలు వెల్లడించారు. ఈ పంచాయతీ వాసులు లోథి రాజ్పుట్ రాజ వంశీయులు కావడం గమనార్హం. 4వేల మందితో కూడిన ఈ పంచాయతీలో తప్పకుండా 18 ఏళ్లు నిండని మైనర్ బాలికలు సెల్ ఫోన్లు వాడకూడదని పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు.