దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు, మహిళలపై వేధింపులు, దోపిడీలు, దొంగతనాలపర్వం కొనసాగుతోంది. దీనికి నిదర్శనం గత ఐదు నెలల్లో ఐదు నెలల్లో 1012 కేసులు నమోదయ్యాయి. తాజాగా వెల్లడైన ఈ గణాంకాలను పరిశీలిస్తే...
దేశం మొత్తంమీద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళలపై సాగుతున్న ఘటనలు పెరుగుతుండటం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు 1,012 రేప్ కేసులు, 4,520 మహిళలపై వేధింపుల కేసులు, 1386 దొంగతనాలు, 86 దోపిడీ కేసులు నమోదయ్యాయని యూపీ బీజేపీ ఎమ్మెల్యే సతీష్ మహానా అడిగిన ప్రశ్నకు యూపీ సర్కారు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొంది.