రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

ఠాగూర్

సోమవారం, 23 జూన్ 2025 (14:31 IST)
దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దీనికితోడు కేంద్రంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ఉంది. దీంతో పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. తమకు ఎదురు తిరిగే వారు ఎంతవారైనా సరే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. 
 
తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ప్రయాణికుడిని ఆయన అనుచరులు చితకబాదారు. ఈ ఘటన వందేభారత్ రైలులో చోటుచేసుకుంది. ఆ ఎమ్మెల్యే పేరు రాజీవ్ సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. వందే భారత్ రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వని కారణంగా ఆయన అనుచరులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

ట్రైన్‌లో బీజేపీ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితకబాదిన అనుచరులు

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్‌లో తనకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు pic.twitter.com/xh6zA3bP48

— Telugu Scribe (@TeluguScribe) June 23, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు