భారత్‌కు వచ్చిన శివాజీ యుద్ధ సమయంలో వాడిన వాఘ్‌నఖ్‌

వరుణ్

గురువారం, 18 జులై 2024 (11:45 IST)
వీర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన ఆయుధం వాఘ్ నఖ్. ఇది పులి పంజా ఆకారంలో ఉంటుంది. లోహంతో తయారైన వాఘ్ నఖ్‌ను చేతికి ధరించి ఎదుటి వ్యక్తి శరీరాన్ని చీల్చివేయవచ్చు. 1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్టల్ ఖాన్‌ను చంపడానికి శివాజీ ఈ వాఘ్ నఖ్‌ను ఉపయోగించాడని చరిత్ర చెబుతోంది. 
 
కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్‌కు చేరింది. లండన్‌లోని ప్రఖ్యాత విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. అయితే, అనేక ప్రయత్నాలు చేసిన మీదట, వందల ఏళ్ల తర్వాత ఈ ఆయుధం తిరిగి భారత్ చేరుకుంది. బుల్లెట్ ప్రూఫ్ కవర్‌లో ఉంచి ఈ ఆయుధాన్ని భద్రంగా భారత్‌కు తీసుకువచ్చారు.
 
శివాజీ ఉపయోగించిన ఈ వాఘ్ నఖ్ లండన్ నుంచి ముంబయి చేరుకున్నట్టు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ వెల్లడించారు. సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఈ వాఘ్ నఖ్‌ను ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచుతున్నామని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు