వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (11:52 IST)
Warrangal
వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం బయటికి వచ్చింది. కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థి మూడో సంవత్సరం విద్యార్థులు ముగ్గురు ర్యాగింగ్‌ చేయడం కలకలం రేపింది. విద్యార్థి బట్టలు విప్పి మూడో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. 
 
ఇకపోతే జాతీయ కోటాలో సీటు సాధించిన తొలి సంవత్సరం విద్యార్థి యూపీలో ఓ కీలక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. మూడో ఏడాది విద్యార్థులు అతడి దుస్తులు తొలగించి ర్యాగింగ్ చేయడంతో అతని కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లింది. దీనిపై డీఎంఈ రమేష్ రెడ్డి వరంగల్ కేఎంసీకి వచ్చి ఆరా తీసినట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు