వివరాల్లోకి వెళితే.. కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన గంగరబోయిన మౌనిక అనే యువతి.. కాంపెల్లి గ్రామానికి చెందిన గంగరబోయిన రవీందర్ కూతురు మౌనిక జూన్ 25న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కూతురు కోసం బంధువుల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో వెతికిన రవీందర్ ఈ నెల 5న సీరోలు పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు.
మౌనిక కోసం పోలీసులు విచారణ చేపట్టగా, మౌనిక అదే గ్రామానికి చెందిన కొండ విజయ్ అనే యువకునితో ఈ నెల 8న హైదరాబాద్లోని సీతాఫల్మండి ఆర్య సమాజ్లో ప్రేమపెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు ఈ విషయాన్ని మౌనిక తండ్రి రవీందర్కు చెప్పారు. ప్రేమ పెళ్ళికి రవీందర్ దంపతులు ఒప్పుకోలేదు. అయితే మౌనిక మాత్రం తాను మేజర్నని, తన ఇష్టం మేరకే పెళ్లి చేసుకున్నానని చెప్పింది.