ఆంధ్రప్రదేశ్ కు నిధులు తక్కువగా ఆ అవకాశమే లేదనీ, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాలకు భాగం అధికంగా ఉందని చెప్పారు. ఆ రాష్ట్రానికి.. ఈ రాష్ట్రానికి ఎక్కువా అనే ప్రశ్నే తలెత్తదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో ఆటంకం ఉన్నాయని చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.
హోళీ సందర్భంగా తన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర పన్నుల్లో ప్రత్యక్ష వాటాగా రాష్ట్రాలకు చాలా ఎక్కువ భాగం లభిస్తోందని, స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంత ఎక్కువ భాగం నిధులు(42శాతం) రాష్ట్రాలకు మంజూరు కావటం ఇదే తొలిసారి అని తెలిపారు. ఇక రాష్ట్రాలకు నిధులు తక్కవనడంలో అర్థమేంటన్నట్లు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఆ విధంగా ఉన్నారు.