వెస్ట్ బెంగాల్ ఎన్నికలు : అనూహ్యంగా ఆధిక్యంలోకి మమత బెనర్జీ

ఆదివారం, 2 మే 2021 (13:22 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. 
 
నాలుగు రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యంలో ఆమె నందిగ్రాంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8,000 ఓట్ల వెనుకంజ‌లో ఉన్న ఆణె... ఆ తర్వాత రౌండ్లలో ఆమె అనూహ్యంగా పుంజుకున్నారు. ఆరు రౌండ్ల ఓట్ల త‌ర్వాత ఆమె 1,427 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
 
కాగా, ప‌శ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్ సంపూర్ణ అధిక్యం దిశ‌గా ప‌రుగులు తీస్తోంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 201 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నిక‌లు జ‌రిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 147 స్థానాల్లో గెల‌వాల్సి ఉంది.
 
కానీ, ప్రస్తుతం టీఎంసీ 202 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 85, వామ‌ప‌క్ష పార్టీలు 3, ఇత‌రులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాల్లో కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు డ్యాన్సులు చేస్తూ, బాణ‌సంచా పేల్చుతూ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు