పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జైగాం జిల్లా జైగాం పట్టణానికి చెందిన సోమ్ బహదూర్ చెట్రీ (45) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య వేరే వ్యక్తితో లేచి పోయింది. దీంతో మానసిక ఆందోళనకు గురైన సోమ్ బహదూర్ మద్యం తాగిన స్థితిలో కసాయిగా మారి కత్తితో తన కూతురు ప్రతీక్ష (7), కుమారుడు ఆకాష్ (5)లపై దాడి చేశాడు. ఆ తర్వాత ప్రతీక్షపై అత్యాచారానికి ఒడిగట్టాడు.