చెన్నై, తిరువొట్రియూరు, రాజాజీ నగర్కు చెందిన గోవిందరాజ్ (45) అనే కిరాణా వ్యాపారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య అనితకు ఇద్దరు పిల్లలున్నా రు. ఆమెతో ఏర్పడిన విభేధాల కారణంగా గోవిందరాజ్ అమ్ము అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఈమెకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు.
గత పదేళ్ళుగా రెండో భార్యా, పిల్లలతో గడుపుతూ వచ్చిన గోవిందరాజ్.. శనివారం సాయంత్రం హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో ఆయనను ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు గోవింద రాజ్ను పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలిసి మృతుడి భార్యలు ఆసుపత్రికి చేరుకున్నారు.