వదినపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడు, నలుగురితో కలిసి గ్యాంగ్ రేప్

సోమవారం, 15 మార్చి 2021 (22:10 IST)
నిర్భయ, దిశ వంటి ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా కామాంధులు నిర్భయంగా రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. వావీ వరుసలు లేకుండా అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వివాహితపై ఐదుగురు కామాంధులు మూకుమ్మడిగా అత్యాచారం చేశారు. ఆమె భర్తను బెదిరించి, కాళ్లు చేతులు కట్టేసి మరీ ఈ దారుణానికి తెగించారు. తన కళ్ల ముందే భార్యను అత్యాచారం చేయడంతో అతడు కన్నీటిపర్యంతమవుతున్నాడు. 
 
రాజస్థాన్‌లో బారాన్ నగరానికి దగ్గరలో ఓ ఊళ్లో ఓ భార్యాభర్తలు కాపురం ఉంటున్నారు. శనివారం ఈ దంపతులిద్దరూ బారాన్ లోని బాలాజీ దేవాలయానికి వెళ్లారు. బైక్ పై వాళ్లిద్దరూ తిరిగొస్తుండగా ఓ ఐదుగురు వ్యక్తులు మార్గమధ్యంలో వారిని అడ్డుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డులోంచి పొలాల్లోకి వారిని తీసుకెళ్లారు. అక్కడ ఆ భర్తను బెదిరించి, భయపెట్టి దాడి చేశారు. ఆ తర్వాత అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. ఆ మహిళపై ఆ ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. 
 
43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే.. అక్కడే వారిని వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఓ వ్యక్తి ఆమెకు తెలిసిన వాడే కావడం గమనార్హం. తన మాజీ భర్త సోదరుడే ఈ ఘటనకు సూత్రధారి కావడం శోచనీయం. ఈ ఘటన షాక్ నుంచి తేరుకున్న ఆమె తన భర్తతో కలిసి సర్దార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు