పని చేస్తున్న ఇంట్లో దొంగతనం ఆరోపణలపై అరెస్టై కటకటాల్లో ఉన్న ఓ యువతిపై ఎనిమిది మంది పోలీస్ మృగాలు సామూహిక అత్యాచారానికి తెగబడ్డాయి. తమ రక్షణలో ఉందన్న విచక్షణ మరిచిన పోలీసులు ఆమె వద్దువద్దని వేడుకుంటున్నా, కనికరించకుండా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు.
బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమె భర్త పోలీసుల్ని నిలదీసేందుకు ప్రయత్నించగా, అతనిని అరెస్టు చేసి మూడు రోజులపాటు నిర్బంధించారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు పోలీసులపై ఫిర్యాదు చేయగా, దానిని తీసుకునే నాధుడే కరవయ్యాడు. ఇప్పటి వరకు ఆమెకు వైద్యపరీక్షలు చేయకపోవడం విశేషం.