కుటుంబ తగాదాలు.. అన్నయ్యను కొడ్డలితో నరికేసిన చెల్లెమ్మ

బుధవారం, 16 ఆగస్టు 2017 (12:03 IST)
ఒరిస్సాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో తోడబుట్టిన సోదరుడిని ఓ చెల్లాయి దూరం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హనగుడలోని పరజ వీధికి చెందిన అన్నాచెల్లెళ్లు రత్నాకర్‌, రొయిలల వివాదం జరిగింది. ఈ వివాదం దాడికి దారితీసింది. ఇద్దరూ దూషించుకుంటూ.. దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన రొయిల గొడ్డలి తీసుకుని అన్న రత్నాకర్‌(30) పై దాడి చేసింది. ఆ దాడిలో రత్నాకర్‌ తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది.
 
దీంతో వెంటనే రత్నాకర్‌ను బంధువులు జయపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపారు. అయితే మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు రొయిలను అరెస్టు చేసి కోర్టు హాజరు పరిచారు. కుటుంబ తగాదాలే సోదరుడిపై దాడి చేసేందుకు కారణమైందని.. విచారణలో తేలింది.

వెబ్దునియా పై చదవండి