మేనల్లుడితో వివాహేతర సంబంధం.. మహిళను వివస్త్రను చేసి.. అందరిముందు..?

సోమవారం, 26 ఆగస్టు 2019 (11:03 IST)
వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పాశ్చాత్య పోకడలు, స్మార్ట్ ఫోన్ల కాలం కావడంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇందులో భాగంగా నేరాల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోతున్నాయి.


తాజాగా మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళకు దారుణ శిక్ష విధించారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెళ్లైన ఓ మహిళ ... తన మేనల్లుడితో రాసలీలలకు దిగింది. భర్త లేని సమయంలో వీరిద్దరు శారీరకంగా కలిసేవారు.
 
ఈ విషయం కాస్త ఊరిపెద్దలకు తెలియరావడంతో పంచాయితీ పెట్టిన గ్రామస్థులు మహిళకు భయంకరమైన శిక్షవిధించారు. అందరి ముందే ఆమెను వివస్త్రను చేశారు. అంతేకాదు ఆమె జుట్టు కూడా కత్తిరించారు. అయితే ఇందులో తన తప్పేం లేదని, మేనల్లుడే తనతో అలా వున్నాడని తనను బ్లాక్ మెయిల్ చేసేవాడని ఆరోపించింది. మేనల్లుడు మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చాడు. మహిళనే తనను బలవంతంగా ఈ సంబంధంలొకి లాగిందని ఆరోపించాడు.
 
దీంతో బాధిత మహిళను బయటకు ఈడ్చి... ఆమెను వివస్త్రను చేశారు. అందరి ముందు నగ్నంగా నిల్చోబెట్టారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పంచాయతీ పెట్టిన పెద్దల్ని విచారించారు. ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై కేసు నమోదు చేశారు. త్వరలో వారందర్నీ అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు