గణతంత్ర దినోత్సవ పెరేడ్ సందర్భంగా భారత సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్)కు చెందిన 'జాన్బాజ్' బృందం మోటార్సైకిళ్లపై చేసిన విన్యాసాలు పెద్దన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అమితంగా ఆకట్టుకున్నాయి. అద్భుతం.... అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఎస్ఎఫ్ బృందం బైక్స్పై వెళుతూ మానవ పిరమిడ్లా ఏర్పడిన విన్యాసం, ఒళ్లు గగుర్పొడిచే ఎన్నో విన్యాసాలను ఒబామా దంపతులు ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు. చప్పట్లతో, బొటనవేలితో థమ్స్అప్ చిహ్నాలు చూపుతూ ప్రోత్సహించారు.