ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో సివల్ఖాస్ ప్రాంతానికి చెందిన సబీర్, జాని ప్రాంతానికి చెందిన ప్రదీప్ లు స్నేహితులు. సబీర్ డోలు వాయించేవాడు, ప్రదీప్ వంటవాడిగా పనిచేసేవాడు. వీరు ఇద్దరు నీలమ్ అనే ఓ హిజ్రా బృందంలో పని చేస్తారు. వృత్తిపరంగా డబ్బుల వద్ద వారికి తేడాలు వచ్చాయి. తాము పక్కకు పోతామని నీలంకు తేల్చి చెప్పారా యువకులు. అయితే వారికి నీలం నచ్చజెప్పింది. అయినా ఇద్దరూ వినలేదు.
రైల్వేరోడ్డు వద్ద రమ్మని చెప్పి వారికి నీలమ్ టీ ఇచ్చిందని, అది తాగిన తర్వాత తాము స్పృహ కోల్పోయారు. ఆ యువకులిద్దర్ని ఓ పౌల్ట్రీ ఫాం వద్దకు తీసుకెళ్ళింది. ఇద్దరు యువకుల అంగాలను కోసిపారేసింది. ఆ ఇద్దరు యువకులు స్పృహలేని పరిస్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్నవారు గమనించి సమాచారం అందించారు. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు జరుపుతున్నారు.