శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వశుభాలు జరుగుతాయి. అలాగే ఇంటి వద్దకు వచ్చే ఆవులకు శుక్రవారం మేత ఇవ్వడం చేస్తే సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. శుక్రవారం రోజు మీరు ఆహారం తీసుకునే ముందుకు నెయ్యి, బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి. ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు.
ఇల్లాలిని ఇంటికి మహాలక్ష్మీగా పూజిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం సాయంత్రం పురుషులకు తమ సతీమణికి సువాసనతో కూడిన పువ్వులను, స్వీట్లను తెచ్చి పెట్టండి. ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం మీరు పొందుతారు.