ఈ 4 రాశుల వారికి జూలై 27 చంద్రగ్రహణం వెంటబడి అదృష్టాన్నిస్తుంది(Video)

మంగళవారం, 24 జులై 2018 (17:04 IST)
చంద్రగ్రహణం అనగానే చాలామంది భయపడిపోతుంటారు. గ్రహణం వస్తే ఏమవుతుందోనని ఆందోళన చెందుతుంటారు. ఐతే జ్యోతిష్య నిపుణులు చెపుతున్నదాని ప్రకారం.. 27 జూలై 2018, శుక్రవారం నాడు ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం ప్రత్యేకించి నాలుగు రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది. అవి మేష రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, మీన రాశులు. ఈ రాశుల వారికి చంద్రగ్రహణం కారణంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది.
 
ఈ గ్రహణ ప్రభావం వారిపై మేలు కలిగిస్తుంది. ఉద్యోగ యోగం, రుణ సౌకర్యాలు వనగూరుతాయి. ఐతే ఈ రాశుల వారు గ్రహణ సమయంలో భగవంతుడి ఆరాధన చేయాలి. ఇకపోతే వృషభం, కర్కాటకం, కన్య, ధనస్సు రాశుల వారికి మధ్యమ ఫలితం కలుగుతుంది. ఈ రాశులకు చెందినవారు  బాగా కృషి చేయాల్సి వుంటుంది. తమ శక్తినే నమ్ముకోవాలి. ఎవరో వచ్చి సహాయపడతారన్నది కూడదు. భగవంతుడిని స్మరించుకుంటే ప్రయత్నిస్తే అంతా మంచి జరుగుతుంది. 
 
ఈ నాలుగు రాశుల వారు కళ్యాణ ప్రాప్తి కోసం భగవన్నామ స్మరణ చేయాలి. విద్యా సంబంధ ఆటంకాలు తొలగేందుకు సరస్వతీ దేవి ఆరాధన చేయాలి. గ్రహణ సమయంలో వీరు బయటకు వెళ్లకపోవడం మంచిది. అలాగే మకరం, కుంభం, మీన రాశి, తులా రాశుల వారికి కూడా ఆశించిన ఫలితాలు వుంటాయి. వీడియో చూడండి...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు