స్కంధ షష్ఠి ఆరాధనతో నాగదోషాలు మటాప్.. నేతి దీపం చాలు..

బుధవారం, 3 ఆగస్టు 2022 (13:25 IST)
స్కంధ షష్ఠి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయి. పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. 
 
స్కంధ షష్ఠి రోజు సాయంత్రం కుమార స్వామికి నేతి దీపం వెలిగించడం ద్వారా ఈతిబాధలు వుండవు.  స్కంధషష్ఠి రోజు కుమార స్వామి పూజ జాతకంలో కుజ దోషం, కాలసర్పదోషాలను తొలగిస్తుంది.  
 
స్కంధ షష్ఠి రోజున నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. ఈ రోజున పేదలకు తమకు చేతనైన సాయం చేయడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు