స్వర్ణరథంపై ఊరేగిన పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబా!

WD
పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా 85వ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. మంగళవారం సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో లక్షలాది భక్తుల మధ్య సత్యసాయి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 250 దేశాల నుంచి వచ్చిన సాయి భక్తులకు బాబా స్వర్ణ రథంపై ఊరేగుతూ దర్శనం ఇచ్చారు.

మంగళవాయిద్యాలు, సేవాదళ్, సత్యసాయి ట్రస్ట్ సాయి నామ స్మరణ మధ్య బాబా స్వర్ణ రథంపై బాబా ఊరేగారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లిఫ్టు ద్వారా బాబా వేదికపైకి చేరుకున్నారు. బాబా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న భక్తులపై ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా భక్తులపై పూల వర్షం కురిపించారు.

వెబ్దునియా పై చదవండి