తిరుమలలో మే 1న సామవేద పారాయణం

శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:50 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న చతుర్వేద పారాయణ యాగంలో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు సామవేదపారాయణం నిర్వహించనున్నారు. వేద పండితులు ఒక్కో బృందంలో 13 మంది చొప్పున 6 బృందాలుగా పారాయణం చేస్తారు. 
 
ఈ పారాయణం ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఆలయంలోని రంగానాయక మండపంలో జరుగుతుంది. ఏప్రిల్ 2020 నుండి ఆలయంలో పారాయణం జరుగుతోంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో యజుర్వేద పారాయణం 4 సెప్టెంబర్ 2022 నుండి 31 జనవరి 2023 వరకు జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రుగ్వేద పారాయణం నిర్వహిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు