కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో నిద్ర చేస్తే...? (video)

శనివారం, 11 డిశెంబరు 2021 (23:29 IST)
కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం... ఇది కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా పరిధిలో ఉంది. ఇక్కడి స్వామి నెమలి వాహనాన్ని అధిష్టించి ఉండగా, ఆయన సన్నిధిలో ఆదిశేషుడు - వాసుకి దర్శనమిస్తూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో నదీ తీరంలో అలరారుతోన్న ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. 

 
వివాహం విషయంలో సమస్యలు ... అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లు, సంతాన సౌభాగ్యాలను కోరుకునేవారు ఈ స్వామిని దర్శిస్తూ ఉంటారు. స్వామి దర్శనం చేసుకుని ఆయనకి పూజాభిషేకాలు జరిపించి ఆ రాత్రికి అక్కడ నిద్ర చేస్తుంటారు.

 
మరునాడు మరలా ఆయన దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతుంటారు. ఈ విధంగా సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిలో నిద్ర చేయడం వలన నాగదోషాలు ... గ్రహ సంబంధమైన దోషాలు నశించిపోతాయని విశ్వసిస్తుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు