పరమశివుడి లీలా విశేషాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి శివుడి మనసు గెలుచుకోవడానికి అభిషేకానికి మించిన సాధనలేదు. ఆలయాలలో భక్తులు శివలింగానికి వివిధరకాల పూజాద్రవ్యాలతో అభిషేకం జరుపుతుంటారు. ఒక్కో అభిషేక ద్రవ్యం వలన ఒక్కో పుణ్యవిశేషం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలా సదాశివుడు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను అందిస్తుంటాడు.