శ్వేతార్కమూల గణపతిని పూజించడం వలన విఘ్నాలు తొలగిపోవడమే కాదు, అనేక రకాల దోషాలు నశిస్తాయని వారంటున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ స్వామి సన్నిధిలోనే అనునిత్యం హోమం జరుగుతూ వుంటుంది. ఈ హోమంలోని విభూతిని ప్రతి మంగళవారం సాయంత్రం కొంచెం కొంచెంగా భక్తులకు ఇస్తుంటారు.
ఈ విభూతిని భక్తులు అపురూపంగా భావిస్తారు. అందువలన దీనిని అందుకునేవారి సంఖ్య అధికంగానే వుంటుంది. ఈ విభూతిని ఇంట్లోని పూజా మందిరంలో వుంచి, అనునిత్యం ధరించడం వలన అన్నిరకాల విఘ్నాలు ... సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు.