కాకతీయుల కాలంలో అనేక ప్రదేశాల్లో శివాలయాల నిర్మాణం జరిగింది. కొన్ని శివాలయాల ప్రాంగణంలో వాళ్లు వేణుగోపాలస్వామిని ప్రతిష్ఠించారు. మరికొన్ని ప్రదేశాల్లో శివాలయంతో పాటుగా శివాంశ సంభూతుడైన హనుమంతుడి ఆలయాలను నిర్మించారు. అలా కాకతీయ 'గణపతిదేవుడు' ఇక్కడి శివాలయం, హనుమంతుడి ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది.
ఈ విధంగా చేయడం వలన నలభై రెండో రోజున ఆ కోరిక నెరవేరుతుందని చెబుతుంటారు. ఈ స్వామి అనుగ్రహంతో సంపదలు, సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం లభిస్తుంది.