జీతం డబ్బుతో శుక్రవారం ఉప్పు కొనుగోలు చేస్తే....

గురువారం, 22 సెప్టెంబరు 2016 (10:26 IST)
స్త్రీలు కొన్ని పనులు చెయ్యాలి కొన్ని పనులు చేయకూడదని పెద్దలు పదే పదే అంటుంటారు. నిజానికి మూఢ నమ్మకాలు అనుకుంటారు కానీ అన్ని కాకపోయినా కొన్నిపనులను ఆరోగ్యపరంగా చేయకూడదని పెద్దవాళ్ళు ఆలోచించి చెప్తుంటారు. వాటిని ఆచరించడం వల్ల మనకు చాలా ఉపయోగాలు కలుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
* స్త్రీలు గుమ్మడి కాయను కొట్టకూడదు. అలా చేయడం వల్ల గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.
* స్త్రీలు రాత్రి పూట గాజులు, కమ్మలు తీయరాదు.
* చనిపోయిన వారి ఇంట కార్యానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు. దుఃఖం విచారించ వచ్చిన వారిని ఇంటికి ఆహ్వానించకూడదు. అలా చేస్తే పరోక్షంగా మనము అశుభములను కోరుకోవడానికి నాంది అవుతుంది.
* ఇంకొకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోరాదు. అదే విధంగా బొట్టునికూడా పెట్టుకోకూడదు.
 
* పెళ్ళి అయిన స్త్రీలునలుపు రంగు వస్తువులు, బట్టలు ధరించ కూడదు.
* ఇంట్లో ఉన్న ఉప్పు, మిరపకాయ, చింతపండు, గుడ్లు వీటిని ఎవరికి ఇచ్చినా చేతిలో ఇవ్వకూడదు. కింద పెట్టండి వాళ్ళే తీసుకుంటారు.
* శుక్రవారం రోజు జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్టమొదట సారి ఉప్పు కొనడం వల్ల పైపై డబ్బులు చేరడానికి అవకాశము ఎక్కువ.
* ఇంటిలో పేరుకుపోయిన దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్య్ర హేతువు. అందువల్ల ఇంటిని పదిరోజులకు ఒకసారి మంగళ, శుక్ర వారములు కాకుండా మిగిలిన రోజులలో దులిపి శుభ్రం చేసుకోవాలి. 

వెబ్దునియా పై చదవండి