బెజవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మంగళ వారం రోజున కనకదుర్గ అమ్మవారిని అత్యంత ప్రసన్నమూర్తిగా గాజులతో అలంకరించారు. అమ్మవారి మూలవిరాట్టుతో పాటు అంతరాలయాన్ని సైతం గాజులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవం కోసం భక్తుల నుంచి 4 లక్షలకు పైగా గాజులు వచ్చాయి. మరో లక్ష గాజులు ఆలయ అధికారులు కొనుగోలు చేసి అలంకరణకు ఉపయోగించారు. ప్రధాన ఆలయంతో పాటు మహా మండపంలోని ఉత్సవ మూర్తికి ఈ గాజులతో అలంకారం చేసారు.