ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, అవ్వాచారి కోన సమీపంలో ఉన్న ఈ అక్క దేవతలు తాము ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతారని భక్తులు భావిస్తారన్నారు. భక్తుల నమ్మకాలను గౌరవిస్తూ కార్తీక మాసంలో ఈ ప్రత్యేక పూజలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్టు జిఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవో క్రిష్ణా డ్డి, తిరుమల శ్రీ నాయుడు తదితరులు పాల్గొంటున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు.